Somuveerraju: రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాం
ABN , First Publish Date - 2022-11-07T11:43:09+05:30 IST
రాజధాని అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు స్పష్టం చేశారు.
విశాఖపట్నం: రాజధాని అమరావతి(AP Capital)కి తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somuveerraju) స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర రాజధానిపై తమ వైఖరిని స్పష్టంగా చెప్పామన్నారు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు ఇచ్చి... మూడు రాజధానులు అంటున్న జగన్ (YS Jagan mohan reddy)ను ప్రశ్నించాలన్నారు. ఈ అంశంపై తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సోమువీర్రాజు (BJP Stater president)అన్నారు.
Read more