కట్లేరు వంతెనపై తాత్కాలిక రాకపోకలకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-10-11T06:11:05+05:30 IST
కట్లేరుపై దెబ్బతిన్న వంతెనను ఆర్అండ్బీ ఎస్ఈ జాన్మోషే సోమవారం పరిశీలించారు.
ఆర్అండ్బీ ఎస్ఈ జాన్మోషే
గంపలగూడెం, అక్టోబరు 10: కట్లేరుపై దెబ్బతిన్న వంతెనను ఆర్అండ్బీ ఎస్ఈ జాన్మోషే సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన వద్ద పరిస్థితిని పరిశీలించామని, తాత్కాలికంగా రాకపోకలకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అంచనాలు వేయాలని ఏఈని ఆదేశించారు. ఆర్అండ్బీ ఈఈ ఏడుకొండలు, రోజా కుమారి, అచ్చారావు, వైసీపీ నాయకులు గౌరసాని శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.