AP High Court: కడపలో ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్ట్ సీరియస్
ABN , First Publish Date - 2022-12-10T11:28:18+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) సొంత ఇలాకా కడప జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై హైకోర్టు (AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమాలపై నిపుణుల ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కడప కలెక్టర్ను ధర్మాసనం (High Court Order to kadapa Collector) ఆదేశించింది. వెదురూరు రీచ్ ఇసుక తవ్వకాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరుతున్నాయని మైదుకూరు, కమలాపురం టీడీపీ ఇన్చార్జ్లు పుట్టా సుధాకర్ యాదవ్, పుత్తా నరసింహారెడ్డి (TDP Leaders) పలుమార్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అక్రమాలపై విచారణ చేపట్టాలని టీడీపీ నేతలు ఎల్లారెడ్డి సహా మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయ స్థానం... నిపుణుల కమిటీతో విచారించి మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని కడప కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.