చంద్రబాబు చేపట్టిన అమరావతి యాగానికి న్యాయదేవత ఊపిరిపోసింది: అనురాధ
ABN , First Publish Date - 2022-03-04T17:02:38+05:30 IST
చంద్రబాబు చేపట్టిన అమరావతి యాగానికి.. న్యాయదేవత ఊపిరిపోసిందని అనురాధ అన్నారు.
విజయవాడ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేపట్టిన అమరావతి యాగానికి.. న్యాయదేవత ఊపిరిపోసిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతికి మరణం లేదని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం 189 మంది రైతులను పొట్టనబెట్టుకుందని విమర్శించారు. జగన్ను నమ్మి ఒక్కరైనా సెంటు భూమి లేదా రూపాయి ఇస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనురాధ అన్నారు.