NTR Dist.: మైలవరంలోని అన్నా క్యాంటీన్‌కు వరి పంట విరాళం

ABN , First Publish Date - 2022-10-06T17:30:19+05:30 IST

మైలవరంలోని అన్నా క్యాంటిన్‌ (Anna Canteen)కు విరాళాలు వెళ్లువెత్తున్నాయి.

NTR Dist.: మైలవరంలోని అన్నా క్యాంటీన్‌కు వరి పంట విరాళం

ఎన్టీఆర్ జిల్లా (NTR Dist.): మైలవరంలోని అన్నా క్యాంటిన్‌ (Anna Canteen)కు విరాళాలు వెళ్లువెత్తున్నాయి. చేబ్రోలు నాగేశ్వరరావు సోదరులు (Nageswararao Brothers) ఐదు ఎకరాల పంట దిగుబడిని అన్న క్యాంటిన్‌కు అందజేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ (Deveneni Uma)కు వరి పంటను అప్పగించారు. దీంతో ఆ పంట పొలంలో నేతలు ఎరువును చల్లారు. ఈ సందర్భంగా  దేవినేని ఉమ మాట్లాడుతూ తెలుగు దేశం నాయకులు ప్రతి పేదవాడికి భోజనం పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. కార్యకర్తలే స్వయంగా వెయ్యి రూపాలయ నుంచి లక్ష వరకు విరాళాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. ధాన్యం ఇచ్చిన దాతలను ఆయన అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నాగేశ్వరరావు సోదరులను ఆదర్శంగా తీసుకోవాలని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-06T17:30:19+05:30 IST