స్పందన అర్జీల పరిష్కారానికి చర్యలు
ABN , First Publish Date - 2022-12-13T00:46:38+05:30 IST
స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీకుంటామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు.
స్పందన అర్జీల పరిష్కారానికి చర్యలు
మేయర్ రాయన భాగ్యలక్ష్మి
చిట్టినగర్, డిసెంబరు 12: స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీకుంటామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలుగా మేయర్, కమిషనర్లకు అందజేశారు. మొత్తం 19 అర్జీలు వచ్చాయి. సమస్యలను ఆయా విభాగాలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో త్వరితగతిన పరిష్కరించాలని మేయర్ అధికారులకు సూచించారు. అదనపు కమిషనర్(జనరల్) ఎం.శ్యామల, చీఫ్ మెడికల్ అఽపీసర్ డా. పి.రత్నావళి, చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకరరావు, డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ) డి.వెంకట లక్ష్మి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డాక్టర్ కె.బి.ఎన్.ఎస్ లతా ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.