ఎక్స్ల్ ప్లాంట్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-12-13T00:49:44+05:30 IST
అజిత్సింగ్నగర్లోని ఎక్సెల్ ప్లాంట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎక్స్ల్ ప్లాంట్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
ఫ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్
అజిత్సింగ్నగర్, డిసెంబరు 12 : అజిత్సింగ్నగర్లోని ఎక్సెల్ ప్లాంట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగ్నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాంట్లో నూతనంగా రెండు గేట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎంట్రన్స్ రోడ్డు నుంచి వేబ్రిడ్జి వరకు రోడ్లు నిర్మించాలని సూచించారు. అదనపు కమిషనర్ కెవి. సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.