65 మంది బడిబాట పట్టారు!
ABN , First Publish Date - 2022-10-08T06:08:23+05:30 IST
65 మంది బడిబాట పట్టారు!
కోడూరు, అక్టోబరు 7: కోడూరు-1, 2, 3 సచివాలయాల పరిధిలో 18 మంది, ఉల్లిపాలెంలో 8, పిట్టలంకలో ఒకరు, సాలెంపాలెంలో నలుగురు, మందపాకలలో 13, వి.కొత్తపాలెంలో 9 మంది, విశ్వనాథపల్లిలో ఇద్దరు, రామకృష్ణాపురంలో ముగ్గురు, లింగారెడ్డి పాలెంలో ఏడుగురు బడి మానేసిన విద్యార్థులను బడిబాట పట్టించినట్లు ఎంఈవో టి.వి.ఎం.రామదాసు తెలిపారు. శుక్రవారం మండలంలోని 11 సచి వాలయాల పరిధిలో ఉపాధ్యాయులు, సచివాలయ కార్య దర్శులు, సంక్షేమ, విద్యా సహాయకులు, మహిళా పోలీసులు ఇంటింటికి తిరిగి 65 మందిని తిరిగి బడిబాట పట్టించారు. కోడూరు మెయిన్ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కాశీభొట్ల నాగభూషణం, సచివాలయ కార్యదర్శి శైలజ తలి ్లదండ్రులకు చదువు ఆవశ్యకతను వివరించి, చిన్నారులకు పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. ఎంపీడీవో నాగరేవతి, ఈవో సుబ్రహ్మణ్యం, కార్యదర్శులు సుధీర్, ఏడుకొండలు పర్యవేక్షించారు.