55 కేసులు.. ఒకరు మృతి
ABN , First Publish Date - 2022-02-19T05:30:00+05:30 IST
55 కేసులు.. ఒకరు మృతి
విజయవాడ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో కరోనా బాఽధితుడు శనివారం మరణించాడు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55 మంది వైరస్ బారినపడ్డారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,565కు పెరిగింది. మరణాలు 1,490కు చేరాయి. ఇంకా 1,182 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో వైరస్ బారినపడిన బాధితుల్లో ఇప్పటి వరకు 1,33,893 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.