అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

ABN , First Publish Date - 2022-11-02T23:38:52+05:30 IST

పట్టణంలోని ఉంగరాల నగర్‌లో బుధవా రం ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

రైల్వేకోడూరు(రూరల్‌), నవంబరు 2: పట్టణంలోని ఉంగరాల నగర్‌లో బుధవా రం ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... మండలంలోని జంగిటివారిపల్లికి చెందిన స్రవంతి(35)కి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన సుఽధీర్‌కు 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుధీర్‌ జీవనోసాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. మృతురాలు స్రవంతి పిల్లలతో కలిసి పట్టణంలోని ఉంగరాలనగర్‌లో నివశిస్తోంది. ఉదయం 11 గంటలకు స్టోర్‌కు వెళ్లి బియ్యం తీసుకుని ఇంటికి వచ్చిందని.. ఉన్నట్టుండి ఇంట్లో నుంచి అరుపులు రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా స్రవంతి నేలపై పడి ఉంది. స్ధానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్‌ గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2022-11-02T23:38:54+05:30 IST