బలిజ కులానికి వన్నె తెచ్చిన వంగవీటి
ABN , First Publish Date - 2022-07-05T05:38:16+05:30 IST
బలిజ కులానికి వన్నె తెచ్చిన వంగవీటి మోహనరంగా. తన తుది శ్వాస వరకు పేదల పక్షాన పోరాడిన మహానాయకుడని డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, బలి జ సంఘం నాయకులు సీతావెంకట సుబ్బయ్య, సంగ వసంతరాయలు, రుద్రవరం శ్రీనివాసులు, నాగేంద్ర ప్రసాద్, రాముడు అన్నారు.
పోరుమామిళ్ల, జూలై 4 : బలిజ కులానికి వన్నె తెచ్చిన వంగవీటి మోహనరంగా. తన తుది శ్వాస వరకు పేదల పక్షాన పోరాడిన మహానాయకుడని డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, బలి జ సంఘం నాయకులు సీతావెంకట సుబ్బయ్య, సంగ వసంతరాయలు, రుద్రవరం శ్రీనివాసులు, నాగేంద్ర ప్రసాద్, రాముడు అన్నారు. సోమ వారం పోరుమామిళ్లలోని పెన్షనర్స్ అసోసి యేషన్ కార్యాలయ ఆవరణలో యువ నాయ కుడు శ్రీకాంత్రాయల్ ఆధ్వర్యంలో వంగవీటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తిరుమలశెట్టి సుబ్బారావు, దనిశెట్టి ఓబయ్య, మేడిసెట్టి వెంకటేశ్వర్లు, డాక్టర్ లకిడి జయరాములు, తదితరులు పాల్గొన్నారు.
బద్వేలు రూరల్: కాప్రాక్స్ ఆధ్వర్యంలో మె ౖదుకూరు రోడ్డు ఆర్అండ్బీ భవన ఆవరణలో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన వంగవీటి మోహనరంగ అన్ని వర్గాలకు చిరస్మరణీయుడ య్యాడన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.