రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ముగ్గురికి బంగారు పతకాలు
ABN , First Publish Date - 2022-11-30T23:28:05+05:30 IST
నంద్యాలలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో రైల్వేకోడూరుకు చెందిన క్రీడాకారులు మూడు బంగారు పతకాలు సాధించినట్లు ఎస్వీకే స్పోర్ట్స్ అకాడమీ కోచ్ శివాజీ, బాలికల కోచ్ కృష్ణవేణిలు బుధవారం తెలిపారు.
రైల్వేకోడూరు, నవంబరు 30: నంద్యాలలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో రైల్వేకోడూరుకు చెందిన క్రీడాకారులు మూడు బంగారు పతకాలు సాధించినట్లు ఎస్వీకే స్పోర్ట్స్ అకాడమీ కోచ్ శివాజీ, బాలికల కోచ్ కృష్ణవేణిలు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి.మనీషా, పి.శ్రీరాం, ఎం.చైతన్యప్రసాద్లు బంగారు పతకాలు, మోక్షశ్రీ, దీక్షిత, టి.శశికుమార్, పి.హర్షవర్థన్, కె.సన్విత, కె.ధన్వంత్లు సిల్వర్ మెడల్స్ను సాధించారన్నారు. ఎం.మనోజ్కుమార్, పి.నాగచరణ్, విష్ణు, నిఖిల్లు బ్రాంజ్ మెడల్స్ సాధించారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు.