ప్రారంభమైన అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2022-05-31T05:28:53+05:30 IST

అయ్యప్పస్వామి నూతన దేవాలయం కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కన నాధనాగేశ్వరకోన దారిలో నిర్మించారు.

ప్రారంభమైన అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ

ఖాజీపేట, మే 30:  అయ్యప్పస్వామి నూతన దేవాలయం కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కన నాధనాగేశ్వరకోన దారిలో నిర్మించారు. ఈ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా ప్రారంభించారు. గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప, మాలికాపురత్తమ, నవగ్రహ, ధ్వజ, పదునెట్టంబడి దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ జూన్‌ 4వ తేదీ జరుగుతుంది. కాగా సోమవారం గణపతి పూజతో ప్రారంభించి మహామృత్యుంజయ హోమం, మంగళవారం జలాదివాసం, వాస్తుహోమం, మొలపూజ, బుధవారం శాంతిహోమం, హోమగుండం, శుద్ధి, కలశాభిషేకం, లక్ష్మీపూజ, శుక్రవారం షయ్యాదివాసం, నేత్ర ఉల్లేఖనం, ఆదివాస హోమాలు జరుగుతాయి. శనివారం విగ్రహ ప్రతిష్ఠతోపాటు పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. కేరళ పండితులు కృష్ణశర్మవారిచేపూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి రూ.కోటికిపైగా ఖర్చు చేసి సుందరంగా నిర్మించారు. ప్రతిష్ఠ విగ్రహ మూర్తులను సోమవారం ఊరేగించారు. భక్తులు తరలి వచ్చి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-31T05:28:53+05:30 IST