డ్రాగా ముగిసిన నార్త్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌ క్రికెట్‌ మ్యాచ్‌

ABN , First Publish Date - 2022-12-09T23:39:22+05:30 IST

నగర శివారు ప్రాంతం కేవోఆర్‌ఎం మైదానంలో ఏసీఏ అండ ర్‌ 25 మెన్‌ ఇంటర్‌ జోనల్‌ మల్టీ డే క్రికెట్‌ రెండు రోజుల మ్యాచ్‌ల్లో భాగంగా నార్త్‌ జోన్‌, సెంటల్ర్‌ జోన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ శుక్రవారం డ్రాగా ముగిసింది.

డ్రాగా ముగిసిన నార్త్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌ క్రికెట్‌ మ్యాచ్‌

కడప (స్పోర్ట్స్‌), డిసెంబరు 9 : నగర శివారు ప్రాంతం కేవోఆర్‌ఎం మైదానంలో ఏసీఏ అండ ర్‌ 25 మెన్‌ ఇంటర్‌ జోనల్‌ మల్టీ డే క్రికెట్‌ రెండు రోజుల మ్యాచ్‌ల్లో భాగంగా నార్త్‌ జోన్‌, సెంటల్ర్‌ జోన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ శుక్రవారం డ్రాగా ముగిసింది. వివరాలిలా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్‌ జోన్‌ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. తదుపరి బ్యాటింగ్‌ చేపట్టిన సెంట్రల్‌ జోన్‌ జట్టు (గురువారం) ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులతో ఎదురీదుతోంది. ఇదిలా ఉండగా ఓవర్‌ నైట్‌ స్కోరు 35 పరుగులతో శుక్రవారం బ్యాటింగ్‌ చేపట్టిన సెంట్రల్‌ జోన్‌ జట్టు చివరి రోజు వర్షం వచ్చే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఇందులో రోహిత్‌ 24 పరుగులు, కౌశిక్‌ 18 పరుగులతో నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలోనార్త్‌ జోన్‌ బౌలర్లు అయిన సత్యనారాయణకు 5 వికెట్లు, అజయ్‌కుమార్‌కు 3 వికట్లు దక్కాయి. నిర్వాహకులు వర్షం కారణంగా మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

Updated Date - 2022-12-09T23:39:26+05:30 IST