ఏర్పేడులో బాలుడు కిడ్నాప్
ABN , First Publish Date - 2022-02-20T04:37:25+05:30 IST
మూడేళ్ల యానాది చెంచు రా మయ్య కిడ్నాప్ అయినట్లు చిత్తూరు జిల్లా ఏర్పేడు సీఐ తెలిపారు.
రైల్వేకోడూరు రూరల్, ఫిబ్రవరి 19: మూడేళ్ల యానాది చెంచు రా మయ్య కిడ్నాప్ అయినట్లు చిత్తూరు జిల్లా ఏర్పేడు సీఐ తెలిపారు. యానాది వెంకటేష్ బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు రైల్వేకోడూరులో సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 9440900729కు ఫోన్ చేయాలని కోరారు.