కుడు పోటీల్లో రైల్వే కోడూరు క్రీడాకారుల ప్రతిభ

ABN , First Publish Date - 2022-12-13T23:27:57+05:30 IST

ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు తమిళనాడులోని వే లూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుడు పోటీల్లో ముగ్గు రు బంగారు పతకాలు సాధిం చినట్లు రైల్వేకోడూరు స్పోర్ట్స్‌ అకాడమీ కోచ్‌ శివాజీ, బాలి కల కోచ్‌ కృష్ణవేణి మంగళ వారం తెలిపారు.

కుడు పోటీల్లో  రైల్వే కోడూరు క్రీడాకారుల ప్రతిభ
పతకాలను సాధించిన కోడూరు క్రీడాకారులు

రైల్వేకోడూరు, డిసెంబరు 13: ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు తమిళనాడులోని వే లూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుడు పోటీల్లో ముగ్గు రు బంగారు పతకాలు సాధిం చినట్లు రైల్వేకోడూరు స్పోర్ట్స్‌ అకాడమీ కోచ్‌ శివాజీ, బాలి కల కోచ్‌ కృష్ణవేణి మంగళ వారం తెలిపారు. అండర్‌ -19 విభాగంలో భార్గవ కుమార్‌, అండర్‌-17 విభా గంలో చరణ్‌, బాలికల విభాగంలో బి. జ్యోతి బంగారు పతకాలు, ఎం. దొర బాబు వెండి, కె. నికితకుమార్‌, జ్యోతికుమారి, మనోజ్‌, సతీష్‌, హేమంత్‌ కుమార్‌, గంభీర్‌ తదితరులు కాంస్య పతకాలు సాధించారన్నారు. వచ్చే నెలలో జరగబోవు రాష్ట్ర స్థాయి పోటీలకు భార్గవ్‌ కుమార్‌, చరణ్‌, జ్యోతి ఎంపికయి నట్లు వివరించారు.

Updated Date - 2022-12-13T23:28:01+05:30 IST