జాతీయ తైక్వాండో పోటీలకు విద్యార్థులు

ABN , First Publish Date - 2022-12-06T23:45:03+05:30 IST

గోవాలో నిర్వహించిన 10వ జాతీయ స్థాయి తైక్వాండో యూత్‌ గేమ్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2022 పోటీలలో రాజంపేట విద్యార్థులు విజయం సాధించారని మంగళవారం రాజంపేట ద్రోణాచార్య మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ మాస్టర్‌ బి.సునీల్‌ తెలిపారు.

జాతీయ తైక్వాండో పోటీలకు విద్యార్థులు

రాజంపేట, డిసెంబరు 6: గోవాలో నిర్వహించిన 10వ జాతీయ స్థాయి తైక్వాండో యూత్‌ గేమ్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2022 పోటీలలో రాజంపేట విద్యార్థులు విజయం సాధించారని మంగళవారం రాజంపేట ద్రోణాచార్య మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ మాస్టర్‌ బి.సునీల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొని నలుగురు స్వర్ణ పతకాలు, రెండు రజితం, రెండు కాంస్య పతకాలను సాధించారన్నారు. పతకాలు సాధించిన వారిలో 35 కిలోల విభాగంలో డి.చరణ్‌ సహస్రతేజ్‌, సి.గీతే్‌షరెడ్డిలు స్వర్ణం, సీనియర్‌ విభాగంలో బి.సుజాత, టి.చంద్రశేఖర్‌లు స్వర్ణ పతకాలు సాధించగా కె.రమేష్‌, సుహాసినిలు రజితం, హర్షవర్ధన్‌చౌదరి, వర్షితలు కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఊటుకూరు ఎంపీటీసీ నాగచంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్‌ రమే్‌షనాయుడులు విజేతలకు పతకాలు సర్టిఫికెట్లు అందజేశారు.

Updated Date - 2022-12-06T23:45:04+05:30 IST