రాష్ట్ర స్థాయి కబడ్డీకి చిన్నమండెం విద్యార్థి
ABN , First Publish Date - 2022-11-11T22:57:37+05:30 IST
స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థి శ్రీహరినాయుడు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు జయచంద్ర తెలిపారు.
చిన్నమండెం, నవంబరు11: స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థి శ్రీహరినాయుడు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు జయచంద్ర తెలిపారు. అం డర్-14 విభాగంలో వైఎ్సఆర్ జిల్లా స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యా డు. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాలలో విద్యార్థిని ప్రధానోపాధ్యాయులు జయచంద్ర, వ్యాయామ ఉపాధ్యాయు డు శ్రీరాములు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.