గ్రామకంఠం భూమిని కాపాడండి
ABN , First Publish Date - 2022-09-11T05:19:12+05:30 IST
కామనూరు గ్రామ సర్వే నెంబరు 547 లోని గ్రామ కంఠం భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్న వారికి కొందరు ఉద్యో గులు సహకరిస్తున్నారంటూ సర్పంచ్ షమీన్ శనివారం స్థానిక తహసీల్దారు నజీర్అహ్మద్ ఫిర్యాదు చేశారు.
ప్రొద్దుటూరు అర్బన్ సెప్టెంబరు 10 : కామనూరు గ్రామ సర్వే నెంబరు 547 లోని గ్రామ కంఠం భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్న వారికి కొందరు ఉద్యో గులు సహకరిస్తున్నారంటూ సర్పంచ్ షమీన్ శనివారం స్థానిక తహసీల్దారు నజీర్అహ్మద్ ఫిర్యాదు చేశారు. ఆ భూ మి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వినతిపత్రం అందజేశారు. ఆ భూమిలో గ్రామ సచివాలయంతో పాటు, రైతు భరోసా కేంద్రం పాలకేంద్రం కట్టడానికి పంచాయతీ రాజ్ డీఈకి అనుమతులు ఇచ్చారన్నారు. ఈ భవనాలు నిర్మించగా మిగిలిన స్థలాన్ని అధికార పార్టీకి చెందిన వారికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఎలాంటి పనులు ప్రారంభించినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.