తవళం మీదుగా ఆర్టీసీ బస్సును నడపాలి
ABN , First Publish Date - 2022-07-19T05:12:26+05:30 IST
మదనపల్లె నుంచి తవళం మీదుగా నిమ్మనపల్లెకు ఆర్టీసీ బస్సును నడపాలంటూ గ్రామస్తులు సోమ వారం చల్లావారిపల్లె వద్ద ఽధర్నా నిర్వహిం చారు.
నిమ్మనపల్లె, జూలై 18: మదనపల్లె నుంచి తవళం మీదుగా నిమ్మనపల్లెకు ఆర్టీసీ బస్సును నడపాలంటూ గ్రామస్తులు సోమ వారం చల్లావారిపల్లె వద్ద ఽధర్నా నిర్వహిం చారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లా డుతూ ఎన్నో ఏళ్లుగా మదనపల్లె 2-డిపో నుంచి మదనపల్లె నుంచి తవళం మీదుగా బస్సు నడుస్తుందన్నారు. అయితే నెల రోజులు గా ఆ బస్సును రద్దు చేయడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నో సార్లు ఆర్టీసీ డిపో మేనేజ ర్కు వినతులు అందించినా ఇప్పటివరకు బస్సును వేయలేదని దీంతో ధర్నా చేపట్టామ న్నారు. దాదాపు రెండు గంటల రాకపోకలు ఆగడంతో స్థానిక పోలీసులు, 2-డిపో అధికారులు వచ్చి బస్సును పునరుద్ధరిస్తామని తెలుపడంతో ధర్నా విరమించారు.