నేడు స్పందన కార్యక్రమం
ABN , First Publish Date - 2022-09-12T04:58:46+05:30 IST
ప్రజా ఫిర్యాదుల స్పందన కార్యక్రమం ఈనెల 12వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా యధాతధంగా జరుగుతుందన్నారు.
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి(కలెక్టరేట్), సెప్టెంబరు 11: ప్రజా ఫిర్యాదుల స్పందన కార్యక్రమం ఈనెల 12వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా యధాతధంగా జరుగుతుందన్నారు. స్పందన కార్యక్రమం ప్రారంభానికి ముందు ఉదయం 9.30 గంటలకు అధికారులతో స్పందన పెండింగ్ దరఖాస్తులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. అధికారులందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.