‘స్వచ్ఛ సంకల్పం’ పరిశీలన
ABN , First Publish Date - 2022-06-08T05:21:57+05:30 IST
పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్డబ్ల్యూపీసీని అక్కడ నిర్వహిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ కన్సల్టెన్స్ సాక్షిశివానిసూద్ సెంట్రల్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
పోరుమామిళ్ల, జూన్ 7 : పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్డబ్ల్యూపీసీని అక్కడ నిర్వహిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ కన్సల్టెన్స్ సాక్షిశివానిసూద్ సెంట్రల్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఆ కమిటీ అక్కడ జరుగుతున్న చెత్తసేకరణ, తడి, పొడిచెత్త విభజించడం, తడి చెత్తను ఉపయోగించి వర్మీకంపోస్టును తయారు చేసే విధానాన్ని స్వయంగా పర్యవేక్షించారు. డస్ట్బిన్ల వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెత్త నుండి సంపద తయారు చేయడానికి తాము తీసుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమం గురించి పంచాయతీ విస్తరణాధికారి రమణారెడ్డి, కార్యదర్శి రాజీవ్రెడ్డి వివరించారు. మదర్ థెరిస్సా ఫౌండేషన్ అనే ఎన్జీవో ద్వారా వేస్ట్ గాజు బాటిల్స్ను ఉపయోగించి తాము చేసిన హ్యాండ్ మేడ్ అలంకృత వస్తువులను ప్రణీత్రెడ్డి అధికారులకు చూపించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిత్తా రవిప్రకా్షరెడ్డి, డీపీఆర్సీ జిల్లా కో-ఆర్డినేటర్ సురేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.