‘పీఆర్సీ జీఓల సంపుటి ఉపయోగకరం’

ABN , First Publish Date - 2022-07-06T04:29:15+05:30 IST

రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్తు ఆంధ్రప్రదేశ(ఆర్జేయూపీ) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన వేతన సవరణ ఉత్తర్వులు సంపుటి పు స్తకం ఉపయోగకరమని ఆ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు.

‘పీఆర్సీ జీఓల సంపుటి ఉపయోగకరం’

కడప(ఎడ్యుకేషన), జూలై 5: రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్తు ఆంధ్రప్రదేశ(ఆర్జేయూపీ) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన వేతన సవరణ ఉత్తర్వులు సంపుటి పు స్తకం ఉపయోగకరమని ఆ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు. మం గ ళవారం కడప నగరం ఆర్జేయూపీ టీచర్స్‌ భవనలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డితో కలిసి ఆయన పీఆర్సీ జీవో సంపుటిని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్‌  శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్ల ఉపయోగార్థం, అవగాహన కొరకు నూతన వేతన స వరణకు సంబంధించిన వివిధ అంశాలు అన్ని రకాల ప్ర భుత్వ ఉత్తర్వులను సంకలనం చేసి ఒక పుస్తకం రూ పంలో విడుదల చేయడం శుభపరిణామమన్నారు. పుస్తక ప్రతులు పూర్తిగా ఆర్జేయూపీ ఆధ్వర్యంలో ఉచితంగా ఉపాధ్యాయుల సేవకై పంపిణీ చేస్తామన్నారు. సంఘం అధికార ప్రతినిధి ముత్తోజు వీరబ్రహ్మం ఎంతో శ్రమతో విషయ సేకరణ చే సి దీన్ని రూపొందించారన్నారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సిద్దయ్య, విద్యాసలహా కమిటీ సభ్యులు రవీంద్రనాథ్‌బాబు, క్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్‌, రాష్ట్ర కార్యదర్శి అన్నెం శ్రీనివాసులరెడ్డి, టీచర్స్‌ హోం ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సీనియర్‌ నా యకులు రెడ్డన్న వీరయ్య, సుబ్బారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సంజీవప్ప, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T04:29:15+05:30 IST