వంద బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2022-12-06T23:23:09+05:30 IST
గుడిపాడులో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్స్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన వంద బస్తాల రేషన్ బియ్యం స్వాధీ నం చేసుకున్నారు.
దువ్వూరు, డిసెంబరు 6: గుడిపాడులో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్స్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన వంద బస్తాల రేషన్ బియ్యం స్వాధీ నం చేసుకున్నారు. ఒక ఇంట్లో బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం అందుకుని దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బి య్యాన్ని దువ్వూరు రెవెన్యూ అధికారులకు అప్పజెప్పి కేసు నమోదు చేశారు.