విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలి
ABN , First Publish Date - 2022-11-11T22:48:14+05:30 IST
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించబోమని ప్రక టన చేయాలని సీపీఎం నాయకులు ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.
మదనపల్లె అర్బన, నవంబరు 11: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించబోమని ప్రక టన చేయాలని సీపీఎం నాయకులు ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ప్రధాని గోబ్యాక్ అంటూ సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరి సంహులు, జిల్లా కార్యవర్గసభ్యుడు కృష్ణప్ప, ఏఐటీయూసీ జిల్లా ప్రదాన కార్యదర్శి సాంబ శివ మాట్లాడుతూ ఇంత వరకు ప్రత్యేక హో దా ఇవ్వలేదని, రైల్వే జోన ఏర్పాటు చేయ లేదని, అలాంటి ప్రధానికి ఎందుకు రాష్ట్రంలో తిరగనిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసగౌడ్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి సురేష్కుమార్, నియో జకవర్గ అధ్యక్షుడు రెడ్డెప్ప, సహాయకార్యదర్శి ముబారక్, పట్టణ కార్యదర్శి దేవా, అధ ్యక్షుడు రవి, గోపాల్, నాగరాజ పాల్గొన్నారు.
ములకలచెరువు: మాట తప్పిన ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని రాషా్ట్రనికి వస్తారం టూ సీపీఐ నాయకులు ప్రశ్నించారు. స్ధానిక వినాయకనగర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదు ట వారు నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ మం డల కార్యదర్శి అంజనప్ప, నాయకులు ఆనంద్, గణేష్, చంద్ర, వేమనారాయణ, జయకర్ తది తరులు పాల్గొన్నారు.