రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థినులు

ABN , First Publish Date - 2022-12-06T23:43:57+05:30 IST

ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు పుల్లంపేటలోని ఆదర్శ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ లీలాశ్రీహరి తెలిపారు.

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థినులు

పుల్లంపేట, డిసెంబరు 6: ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు పుల్లంపేటలోని ఆదర్శ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ లీలాశ్రీహరి తెలిపారు. మంగళవారం ఆదర్శపాఠశాలలో జిల్లా స్థాయి అండర్‌-19 ఎస్‌జీఎఫ్‌ సెలక్షన్స్‌ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందకు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. సెలక్షన్స్‌ను ఎస్‌జీఎఫ్‌ జిల్లా ప్రెసిడెంట్‌ శారద ప్రారంభించారు. ఈ సెలక్షన్స్‌లో పుల్లంపేట ఆదర్శ పాఠశాలకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు మంజుల, రమ్య, ఉమాదేవి, జ్యోతిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పీడీ నీలకంఠరావు, పీఈటీలు షరేషి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్‌ నిర్వహించారు.

Updated Date - 2022-12-06T23:43:58+05:30 IST