వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-11-23T23:14:18+05:30 IST

బిందు సేద్యం, డ్రిప్‌ ఇరిగేషన్‌లో వినియోగించే స్ర్పింక్లర్లు ఇతర పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధిస్తూ రైతులపై భారం మోపడం అన్యాయమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని రద్దు చేయాలి

ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్‌

కడప (సెవెన్‌రోడ్స్‌), నవంబరు 23: బిందు సేద్యం, డ్రిప్‌ ఇరిగేషన్‌లో వినియోగించే స్ర్పింక్లర్లు ఇతర పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధిస్తూ రైతులపై భారం మోపడం అన్యాయమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని ఆదా చేసే లక్ష్యంతో నీటి కొరత ఉన్న మెట్ట ప్రాంతాల్లో బిందు సేద్యాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీలు ఇస్తున్నామని ప్రభుత్వం ఒక వైపు ప్రచారం చేసుకుంటూ మరో వైపు పరికరాలపై కేంద్ర ప్రభుత్వం 12 శాతం జీఎస్టీ భారాన్నీ రైతులపై మోపడం దుర్మార్గకరమన్నా రు. ఇప్పటికే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతోందని, పండించి న పంటలకు గిట్టుబాటు ధర, మద్దతు ధర లేదని రైతాంగాన్ని ఆదుకోవాల్సిన తరుణంలో కేంద్రం జీఎస్టీ విధించడం బాధాకరమన్నారు. వెంటనే వ్యవసా య పరికరాలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-11-23T23:14:19+05:30 IST