ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
ABN , First Publish Date - 2022-10-01T04:41:53+05:30 IST
సుం డువారిపల్లెలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు అన్నదా నం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు మొక్కులు తీర్చుకున్నారు.
రాజంపేట, సెప్టెంబరు30: సుం డువారిపల్లెలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు అన్నదా నం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు మొక్కులు తీర్చుకున్నారు. రాజంపేట టీడీపీ నేతలు గన్నే సుబ్బనరసయ్యనాయుడు, రాజు విద్యాసంస్థల అధినేత జగన్మోహన్రాజు, రాజంపేట పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, పట్టణ మాజీ అధ్యక్షుడు తరిగోపుల సంజీవరావు, టీడీపీ పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లనాయుడు, కాకతీయ సేవా సమితి జిల్లా అధ్యక్షులు గొల్లపూటి శివనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.