రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-02-17T04:39:51+05:30 IST
సహకార పరపతి సంఘాల ద్వారా రైతులు వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు పొందే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు.
ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి
పెండ్లిమర్రి, ఫిబ్రవరి 16 : సహకార పరపతి సంఘాల ద్వారా రైతులు వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు పొందే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. మండల పరిధిలోని వెల్లటూరు సహకార పరపతి సంఘ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అనంతరం వెల్లటూరు సమీపంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గోడౌన్ను, మిట్టమీదపల్లె పరిధిలో పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం సహకార సొసైటీ స్థలాన్ని, అలాగే పెండ్లిమర్రి సమీపంలో ఉన్న సొసైటీ స్థలాలను ఆమె పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ్భాస్కర్రాజు, జడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, వెల్లటూరు సహకారపరపతి సంఘం అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి, ఆర్కేనగర్ బ్రాంచ్ మేనేజర్ బాలాజీ సొసైటీ సీఈవోలు వెంకటసుబ్బారెడ్డి, రాము, తదితరులు పాల్గొన్నారు.