నల్లతామరపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-12-06T23:38:32+05:30 IST

మిరప సాగుచేసే రైతులు నల్లతామర పురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉద్యానశాఖ అధికారి భరత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

 నల్లతామరపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

మైలవరం, డిసెంబరు 6 : మిరప సాగుచేసే రైతులు నల్లతామర పురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉద్యానశాఖ అధికారి భరత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నకొమెర్ల గ్రామంలో ఉద్యానశాఖ, దాల్మియా ఆధ్వర్యంలో మిరప పంటలో నల్లతామరపురుగు, వైరస్‌, తెగుళ్లపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మిరపకు పూత దశలో నల్లతామర పురుగు ఉధృతిపై రైతులకు వివరించాలి. అనంతరం మిరపలో పురుగుల నివారణకు రైతులకు పసుపు, నీలిరంగు జిగురు అట్టలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ సిబ్బంది దాల్మియా అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:38:51+05:30 IST