జలజీవన మిషనతో ఇంటింటికి తాగు నీరు
ABN , First Publish Date - 2022-12-06T23:17:05+05:30 IST
జలజీవన మిషన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటికి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పీవోఆర్డీ కోఆర్డినేటర్ రాధ తెలి పారు.
నిమ్మనపల్లె, డిసెంబరు 6: జలజీవన మిషన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటికి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పీవోఆర్డీ కోఆర్డినేటర్ రాధ తెలి పారు. మంగళవారం మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఎంపీడీవో లీలామాదవి మాట్లాడుతూ ప్రతి ఇంటికి కొళాయిలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నీటి సరఫరా లేని ఇళ్లకు జలజీవన మిషన ద్వారానే పరికరాలు అమర్చి తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కోఆర్డినేటర్ రాధ మాట్లాడుతూ గ్రామంలో వున్న అన్ని పల్లెల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. గ్రామస్థులకు ఎలాంటి సమస్యలున్నా తమకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ రెడ్డెమ్మ, ఆర్డబ్ల్యూ ఎస్ ఏఈ హరినాథరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మారెప్ప, యర్ర మల్లయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు.