స్పందనకు వెల్లువెత్తిన ఫిర్యాదులు

ABN , First Publish Date - 2022-09-19T05:30:00+05:30 IST

మదన పల్లె సబ్‌కలెక్టరేట్‌లో సోమవారం నిర్వ హించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తాయి.

స్పందనకు వెల్లువెత్తిన ఫిర్యాదులు
స్పందన కార్యక్రమంలో ఆర్డీవోకు అర్జీలు అందజేస్తున్న ప్రజలు

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 19: మదన పల్లె సబ్‌కలెక్టరేట్‌లో సోమవారం నిర్వ హించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తాయి. ఈ సంద ర్భంగా మదనపల్లె మండలంలోని తెట్టు వంకను ఓ భూస్వామి ఆక్రమించుకుని కంచె వేశారని కొత్తవారిపల్లె రైతు రవీంద్ర ఫిర్యాదు చేశా డు. మదనపల్లె- తిరుపతి నాలుగు లేన్ల జాతీయ రహదారి కోసం భూమి తీసుకున్నా ఇంత వరకు నష్టపరిహారం చెల్లించలేద ని, వీఆర్‌వో నిర్లక్ష్యం వలన తమకు పరిహారం అందడంలో ఆలస్యమవుతోందని కొత్తవా రిపల్లె గ్రామస్థులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె బైపాస్‌ రోడ్డులో డీకేటీ స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని కాలనీ ప్రజలు ఫిర్యాదు చేశారు. భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై 11 మండలాలకు చెందిన ప్రజలు మొత్తం మీద స్పందన కార్యక్రమానికి 52 మంది అర్జీలు సమర్పించారు. వాటిపై సంబంధిత అధికారులు విచారించి నిర్దేశించి న సమయంలో పరిష్కరించాలని ఆర్డీవో మురళి మండల అధికారులకు సూచించారు.


Updated Date - 2022-09-19T05:30:00+05:30 IST