పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ABN , First Publish Date - 2022-12-13T23:24:40+05:30 IST
పరిశుభ్రతతో వ్యాధులు దూరం అవుతాయని మహిళలు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్బాష, శానిటరీ సెక్రటరీలు సూచించారు.
జమ్మలమడుగు రూరల్, డిసెంబరు 13: పరిశుభ్రతతో వ్యాధులు దూరం అవుతాయని మహిళలు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్బాష, శానిటరీ సెక్రటరీలు సూచించారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణంలోని మూడు, 4, 9, 10, 17, 18, 19, 20 వార్డుల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఈనెల 12వ తేదీ నుంచి పారిశుధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు వ్యర్థపదార్థాలను కాలువల్లో వేసి పారిశుధ్య కార్మికులకు ఇబ్బంది కలిగించరాదన్నారు. తడి, పొడిచెత్త, హానికరచెత్త వేరువేరు చేసి చెత్తబుట్టల్లో తమ కార్మికులకు అందించాలన్నారు. అనంతరం తాడిపత్రి రోడ్డులోని షాపింగ్ కాంప్లెక్స్లో ప్లాస్టిక్ కవర్లు వాడరాదని అవగాహన కలిగించారు. ప్లాస్టిక్ వాడే దుకాణాలలో కవర్లు స్వాధీనం చేసుకుని రూ.2,700 జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ తెలిపారు.