మల్బరీ సాగుపై రైతులకు అవగాహన

ABN , First Publish Date - 2022-12-06T23:18:34+05:30 IST

మండలంలోని అరికెల పంచాయతీ గౌనివారిపల్లెలో మంగళవారం పట్టు శాఖకు చెందిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ సెరికల్చర్‌ రామ్మోహ న, సాంకేతిక సేవా కేంద్ర అధికారి రఘునాథ్‌రెడ్డి మల్బ రీ మొక్కలు నాటిన రైతులతో మాట్లాడుతూ పట్టు పరిశ్రమ మిగతా పంటలతో పోలిస్తే రైతుకు ఎంతో లాభదాయకమన్నారు.

మల్బరీ సాగుపై  రైతులకు అవగాహన

రామసముద్రం, డిసెంబరు 6: మండలంలోని అరికెల పంచాయతీ గౌనివారిపల్లెలో మంగళవారం పట్టు శాఖకు చెందిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ సెరికల్చర్‌ రామ్మోహ న, సాంకేతిక సేవా కేంద్ర అధికారి రఘునాథ్‌రెడ్డి మల్బ రీ మొక్కలు నాటిన రైతులతో మాట్లాడుతూ పట్టు పరిశ్రమ మిగతా పంటలతో పోలిస్తే రైతుకు ఎంతో లాభదాయకమన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు, సబ్సిడీ లు, ఎనఆర్‌ఈజీఎస్‌ నుంచి రైతుకు వచ్చే లబ్ధి గురించి వివరించారు. అదే విధంగా పట్టుపురుగుల పెంపకంలో వచ్చు వ్యాధులు, చీడల నివారణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశాఖ అధికారులు రసూల్‌, నంజుండరావు, ఆంజినేయులు, మదనపల్లె డివిజన ఆర్బీకే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:19:18+05:30 IST