15లోగా వైద్యుల నియామకం
ABN , First Publish Date - 2022-09-28T04:07:42+05:30 IST
ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రులలో కొరత ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సుల నియామకాన్ని అక్టోబరు 15వ తేదీలోగా పూర్తి చేస్తామని డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీసీహెచ్ఎ్స) డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
డీసీహెచ్ఎ్స డాక్టర్ చంద్రశేఖర్
బి.కొత్తకోట, సెప్టెంబరు 27 : ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రులలో కొరత ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సుల నియామకాన్ని అక్టోబరు 15వ తేదీలోగా పూర్తి చేస్తామని డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీసీహెచ్ఎ్స) డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన బి.కొత్తకోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఓపీ తదితర అంశాల గురించి వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రిలో త్వరలో సర్జరీలు కూడా జరుగుతాయని అలాగే జనరల్ ఆపరేషన్లు కూడా జరిగేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో తమ పరిధిలో ఒక జిల్లా ఆసుపత్రితో పాటు 3 ఏరియా ఆసుపత్రులు, 2 యాభై పడకల ఆసుపత్రులు, 30 పడకల ఆసుపత్రులు 5 ఉన్నాయని వీటిలో కొరతగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సుల పోస్టులను అక్టోబరు 15వ తేదీలోగా భర్తీ చేస్తామని తెలిపారు. బి.కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి బ్లడ్ బ్యాంకు మంజూరైందని పరికరాలు కూడా వచ్చాయని త్వరలోనే రక్తనిధి కేంద్రం ప్రారంభిస్తామన్నారు. నాడు-నేడు పథకం ద్వారా జిల్లాలోని 8 ప్రభుత్వ ఆసుపత్రులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం సీజనల్గా వచ్చే జ్వరాలతో ఆసుపత్రులకు రోగులు అధికంగా వస్తున్నారన్నారు. వారికి తగిన వైద్యం అందించేలా అందరికీ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సీహెచ్సీ వైద్యాధికారి హసీనా పర్వీన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.