ప్రజలను నట్టేటముంచుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-01T23:48:47+05:30 IST

రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం నట్టేటముంచు తోందని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి ఆరోపించా రు.

ప్రజలను నట్టేటముంచుతున్న ప్రభుత్వం
చింతపర్తిలో ‘ఇదేం ఖర్మ’ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న టీడీపీ నాయకులు

వాల్మీకిపురం, డిసెంబరు 1: రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం నట్టేటముంచు తోందని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి ఆరోపించా రు. గురువారం మండలం లోని చింతపర్తి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఒక్క ఛాన్స అని ప్రాధేయపడ్డ సీఎం జగనకు రాష్ట్ర ప్రజలు పట్టం కడితే ఈ మూడున్నరేళ్లలో సుమారు అయిదు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అదోగతి పాలుచేశారని విమర్శిం చారు. శుక్రవారం నుంచి మండలం వ్యాప్తంగా ఇదేం ఖర్మ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ మహిత, నాయకులు కాంతరాజుశెట్టి, ద్వారకనాథరెడ్డి, వల్లిగట్ల వెంకటరమణ, చంద్రారెడ్డి, సదాశివారెడ్డి, లక్ష్మీనారాయణ, శివప్రసాద్‌, చెన్నకేశవ, రామాంజులు, హరినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-01T23:48:49+05:30 IST