అరటి తోటలను పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2022-12-13T23:29:47+05:30 IST
మాండస్ తుఫాన్తో దెబ్బతిన్న అరటితోటలను మంగళ వా రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పరిశీలించారు.
రాజంపేట, డిసెంబరు 13: మాండస్ తుఫాన్తో దెబ్బతిన్న అరటితోటలను మంగళ వా రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పరిశీలించారు. హస్తవ రం ప్రాంతంలో దెబ్బతిన్న అర టి తోటలను ఉద్యాన అధికారు లతో కలిసి పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై జిల్లా ఉద్యాన అధి కారి రవిచంద్రబాబు ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మాండస్ తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా 282 హెక్టా ర్లలో అరటిపంట దెబ్బతి నడంతో రూ.5.50 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్ తెలిపారు.
రాజంపేట మండల పరిధిలో 132 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిందన్నారు. కార్యక్ర మంలో ఆర్డీఓ కోదండ రామిరెడ్డి, ఉద్యాన అధికారులు రమేష్ బాబు, సురేష్బాబు, తహసీల్దార్ సుబ్రహ్మ ణ్యంరెడ్డి, సర్పంచు మహీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.