Janasean leader: వైసీపీ మంత్రులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
ABN , First Publish Date - 2022-08-18T17:34:38+05:30 IST
వైసీపీ మంత్రులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు.
తిరుపతి: వైసీపీ మంత్రులు (YCP Ministers) కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran royal) ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ (Jagan mohan reddy) చెప్పే సామాజిక న్యాయం వైసీపీ (YCP)కి వర్తించదన్నారు. జగన్ (CM Jagan) సామాజిక వర్గాన్ని తన ఇంటి లోపలికి పిలిపించుకొని, ఇతర కులాల వారిని గుమ్మం ముందు ఉంచుతారని మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ (Gudivada amarnath) పని చేయకుండా, పవన్ (Pawan kalyan)ను విమర్శించడమే డ్యూటీగా పెట్టుకున్నారన్నారు. అమర్నాథ్ (Minister Amarnath ) బాలనటుడు అనుకుంటున్నారి.. జగన్ అవార్డులు ఏమి ఇవ్వరని యెద్దేవా చేశారు. గుడివాడ అమర్నాథ్ కాపు కులంలో పుట్టి, జగన్కు కాపలా కుక్కలా మారారని విరుచుకుపడ్డారు. మహిళలు జనసేన వైపు ఉన్నారని... వైసీపీ అంటే చీదరించుకుంటున్నారన్న విషయం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి (Narayana swamy) గమనించాలని తెలిపారు. వైసీపీలో బట్టలు ఊడదీసుకొని షో లు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం మహిళల దగ్గర వెళ్తే తెలుస్తుందని కిరణ్ రాయల్ వ్యాఖ్యలు చేశారు.