గిరిజనుల భూములకు జగన్రెడ్డి ఎసరు: టీడీపీ
ABN , First Publish Date - 2022-10-08T09:22:39+05:30 IST
గిరిజనుల భూములకు జగన్రెడ్డి ఎసరు: టీడీపీ
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి):గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి బయ్యారంలోని గిరిజన భూములను కాజేస్తే.. ఇప్పుడు ఆయన కొడుకు జగన్ విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గిరిజన భూముల్ని కొల్లగొట్టడానికే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని టీడీపీ నేతలు ధారునాయక్, మొగిలి ఎల్లయ్యలు ధ్వజమెత్తారు. జగన్రెడ్డి ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న అన్యాయం రాష్ట్ర ఎస్టీ కమిషన్కు కనిపించడం లేదా? అని వారు ప్రశ్నించారు.