AP News: జగన్ ఒక సైకో ముఖ్యమంత్రి.. టీడీపీ సీనియర్ నేతలు
ABN , First Publish Date - 2022-09-18T00:10:37+05:30 IST
Kakinada: టీడీపీ (TDP) సీనియర్ నేతలు సీఎం జగన్ (CM Jagan) వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు బండారు సత్యనారాయణ, బుద్ధా వెంకన్న జగన్ను ఒక సైకోతో పోల్చారు. రాజ్యాంగం తెలియని మూర్ఖుడని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమ
Kakinada: టీడీపీ (TDP) సీనియర్ నేతలు సీఎం జగన్ (CM Jagan) వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు బండారు సత్యనారాయణ (Bandaaru Satyanarayana), బుద్ధా వెంకన్న (Budda Venkanna) జగన్ను ఒక సైకోతో పోల్చారు. రాజ్యాంగం తెలియని మూర్ఖుడని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జగన్ రాష్ట్ర రాజధాని అమరావతికి జై కొట్టి.. ఇప్పుడు మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడం .. గతంలో రాజధానిపై హై కోర్టు తీర్పు ఇచ్చినా.. ఆ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. శాసనసభలో మూడు రాజధానులకు అనుకూలంగా టీడీపీ ప్రజాప్రతినిథులు మాట్లాడితే సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు.