ప్రతి అడుగులో రైతుకు తోడుగా ఆర్బీకేలు: జగన్

ABN , First Publish Date - 2022-06-07T17:58:00+05:30 IST

గుంటూరులో సీఎం జగన్ పర్యటించారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. ట్రాక్టర్, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీని సైతం ప్రారంభించారు.

ప్రతి అడుగులో రైతుకు తోడుగా ఆర్బీకేలు: జగన్

గుంటూరు: గుంటూరులో సీఎం జగన్ పర్యటించారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. ట్రాక్టర్, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీని సైతం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్ హార్వెస్టర్లను పంపిణీ చేశారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘‘ ప్రతి అడుగులో రైతుకు తోడుగా ఆర్బీకేలు ఉన్నాయి. ఆర్బీకేల్లో యంత్ర పరికరాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో రూ.2,016 కోట్ల విలువైన పరికరాలు అందిస్తాం. చంద్రబాబు హయాంలో అరకొర ట్రాక్టర్లు ఇచ్చారు. గతంలో డీలర్లతో కలిసి మంత్రులు స్కాంలు చేశారు. ప్రజలు గతానికి.. ఇప్పటికి తేడా గమనించాలి. ఇప్పుడు రైతులు వారికి కావాల్సిన ట్రాక్టర్లను వారే కొనుగోలు చేస్తారు. అవినీతి లేకుండా వ్యవస్థను క్లీన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2022-06-07T17:58:00+05:30 IST