AP News: ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవం
ABN , First Publish Date - 2022-07-29T19:34:26+05:30 IST
నగరంలోని ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తిరుపతి: నగరంలోని ఎస్వీ జంతు ప్రదర్శనశాల(SV Zoo park)లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy ramachandra reddy) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపార్క్ అవరణలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం పులుల ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించించారు. పులుల ఫోటో ఆల్బమ్, పోస్టర్ను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ బ్రోచర్స్, వెబ్సైట్ను ఆవిష్కరించారు. ప్రతిభ కనబర్చిన అటవీ శాఖ సిబ్బందికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవార్డులు ప్రదానం చేశారు.