High Court: న్యాయమూర్తి ముందు హాజరయిన ఐఏఎస్ అధికారులు
ABN , First Publish Date - 2022-11-18T20:33:15+05:30 IST
Amaravathi: కూలీలకు ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో గతంలో కేసు దాఖలైంది. తక్షణమే బిల్లులు చెల్లించాలని సంవత్సరం క్రితం కోర్టు ఆదేశించింది.
Amaravathi: కూలీలకు ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో గతంలో కేసు దాఖలైంది. తక్షణమే బిల్లులు చెల్లించాలని సంవత్సరం క్రితం కోర్టు ఆదేశించింది. అయితే అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంపై దిక్కరణ కేసు దాఖలైంది. ఈ కేసులో ప్రభుత్వం తరుపున ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్.రావత్, గోపాలకృష్ణ ద్వివేది, కోన శశిధర్, వివేక్ యాదవ్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేదని జస్టిస్ బట్టు దేవానంద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కోర్టు దిక్కరణ కేసు ఉందని రెండు రోజుల క్రితం డబ్బులు అకౌంట్లో వేశారు. సంవత్సర కాలం జాప్యం చేయడంపై వివరణ ఇవ్వండి. వివరణ సంతృప్తికరంగా లేకపోతే దిక్కరణ కింద నిర్ణయం తీసుకుంటాం. మీకు ఒక నెల జీతం ఆగితే ఊరుకుంటారా?’’ అని న్యాయమూర్తి అధికారులను నిలదీశారు.