ఆర్బిట్రేటర్‌గా జస్టిస్‌ దేవీందర్‌ గుప్తా!

ABN , First Publish Date - 2022-02-23T08:20:55+05:30 IST

ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌(ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌) కార్యనిర్వహణ కమి టీ సభ్యుల విషయంలో రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్బిట్రేటర్‌గా హైకోర్టు విశ్రాంత

ఆర్బిట్రేటర్‌గా జస్టిస్‌ దేవీందర్‌ గుప్తా!

‘ఎన్‌ఆర్‌ఐ’ వివాద పరిష్కారానికి హైకోర్టు ప్రతిపాదన


అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌(ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌) కార్యనిర్వహణ కమి టీ సభ్యుల విషయంలో రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్బిట్రేటర్‌గా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవీందర్‌ గుప్తా పేరును హైకోర్టు ప్రతిపాదించింది. ఇందుకు ఆయన సమ్మతి తీసుకొని తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ఆయన ఆసక్తి కనబర్చకపోతే హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్‌ నిస్సార్‌ అహ్మద్‌ కక్రూ పేరును ఆర్బిట్రేటర్‌గా పరిశీలిస్తామని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌ కార్యనిర్వహణ కమిటీ సభ్యుల వివాదాన్ని ఆర్బిట్రేటర్‌ వద్ద పరిష్కరించుకోవాలని సోమవారం జరిగిన విచారణలో హైకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-02-23T08:20:55+05:30 IST