శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్కుమార్
ABN , First Publish Date - 2022-02-20T01:35:54+05:30 IST
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్కుమార్ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్కుమార్ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. ఆ తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.