GVL: వైసీపీ చేసింది ముమ్మాటికీ దుర్మార్గమే..

ABN , First Publish Date - 2022-09-25T18:56:17+05:30 IST

యుగ పురుషుడు ఎన్టీఆర్ (NTR) నుంచి టీడీపీ (TDP)ని దక్కించుకోవడం కోసం ఒకప్పుడు...

GVL: వైసీపీ చేసింది ముమ్మాటికీ దుర్మార్గమే..

అమరావతి (Amaravathi): యుగ పురుషుడు ఎన్టీఆర్ (NTR) నుంచి టీడీపీ (TDP)ని దక్కించుకోవడం కోసం ఒకప్పుడు వెన్ను పోటు పొడిచి మరణానికి కారకులైన వారు ఇవాళ అతి ప్రేమను వలకబోస్తున్నారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) ట్విట్టర్ (Twitter) వేదికగా విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్‌ (Jr. NTR)ను "నువ్వు వారసుడివా" అని వెక్కిరించటం, అవమానించటం, కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయ వికృతానికి, 'దగా' రాజకీయాలకు పరాకాష్టని అన్నారు. భగవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసులో నిలిచిన ఎన్టీఆర్‌ను వివాదంలోకి లాగిన వైసీపీ (YCP) చేసింది ముమ్మాటికీ దుర్మార్గమేనన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చటం కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చారని, ఎన్టీఆర్ మనసును వికృత రాజకీయాల కోసం క్షోభపెట్టొద్దని సీఎం జగన్‌ (CM Jagan)కు జీవీఎల్ నరసింహారావు సూచించారు. 

Updated Date - 2022-09-25T18:56:17+05:30 IST