AP News: పాత పింఛను విధానాన్నిపునరుద్ధరించాలని సీఎం ఇంటి ముట్టడి

ABN , First Publish Date - 2022-08-16T00:39:32+05:30 IST

Amaravathi: తాడేపల్లిలోని సీఎం జగన్ (CM Jagan) ఇంటిని సెప్టెంబరు 1వ తేదీన ముట్టడించనున్నట్లు సీపీఎస్‌యూఎస్ (Contributory Pension Scheme) నాయకులు తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం పునరుద్ధరించాలని

AP News: పాత పింఛను విధానాన్నిపునరుద్ధరించాలని సీఎం ఇంటి ముట్టడి

Amaravathi: తాడేపల్లిలోని సీఎం జగన్ (CM Jagan) ఇంటిని సెప్టెంబరు 1వ తేదీన ముట్టడించనున్నట్లు సీపీఎస్‌యూఎస్ (Contributory Pension Scheme) నాయకులు తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 1న బ్లాక్ డే పాటిస్తున్నామని తెలిపారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లా సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌పై కమిటీలు వేస్తూ ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు. సీఎం ఇంటి ముట్టడిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొనాలని సీపీఎస్‌యూఎస్ పిలుపు నిచ్చారు.

Updated Date - 2022-08-16T00:39:32+05:30 IST