AP News: స్టిక్కర్ పార్టీ వైసీపీ : సునీల్ థియోధర్
ABN , First Publish Date - 2022-10-02T02:52:27+05:30 IST
గుంటూరు జిల్లా: వైసీపీ , టీడీపీలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు కొత్తపేటలో జరిగిన బీజేపీ ప్రజా పోరు సమావేశంలో ఆయన సీఎం జగన్ను తూర్పార బట్టారు. పరిపాలనలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. ప్రధాని మోదీ పథకాలకు జగనన్న పథకాలు అంటూ స్టిక్కర్లు వేసుకోవడం
గుంటూరు జిల్లా: వైసీపీ , టీడీపీలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు కొత్తపేటలో జరిగిన బీజేపీ ప్రజా పోరు సమావేశంలో సీఎం జగన్ను ఆయన తూర్పార బట్టారు. పరిపాలనలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. ప్రధాని మోదీ పథకాలకు జగనన్న పథకాలు అంటూ స్టిక్కర్లు వేసుకోవడం ద్వారా వైసీసీ స్టిక్కర్ పార్టీగా మారిందని విమర్శించారు. అమరావతి రైతులను నాశనం చేసిన చంద్రబాబుకు రాజధాని గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. చంద్రబాబు నెంబర్ 1 క్రిమినల్కాగా.. జగన్ నెంబర్ 2 క్రిమినల్ అని ఆరోపించారు. రాజధానిని అభివృద్ధి చేయాలన్న ఆలోచన టీడీపీ, వైసీపీకి లేవన్నారు. హిందువులు కట్టిన టాక్స్ డబ్బును సీఎం జగన్ చర్చి పాస్టర్లకు జీతాలుగా ఇస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు, నెల్లూరు, అంతర్వేదిలో దేవాలయాల మీద దాడులు చేసిన వారిని అరెస్టు చేయకపోవడం జగన్ యాంటీ హిందువు అని తేలిపోయిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాశ్, పాటిబండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.