18 క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల
ABN , First Publish Date - 2022-09-17T05:47:13+05:30 IST
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం బుధవారం నాటికి 588.50 అడుగులు(307.57 టీఎంసీలు) ఉంది.
విజయపురిసౌత్, సెప్టెంబరు 16: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం బుధవారం నాటికి 588.50 అడుగులు(307.57 టీఎంసీలు) ఉంది. ఎస్ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 9,800, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,576, వరద కాలువ ద్వారా 400, 18 క్రస్ట్గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,64,888, మొత్తం 3,10,764 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 3,10,764 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.40(212.43 టీఎంసీలు) అడుగులుంది.
బ్యారేజి దిగువకు 3,04,500 క్యూసెక్కులు
తాడేపల్లి టౌన్: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి బ్యారేజి వద్ద ఇన్ఫ్లో 3,18,000 క్యూసెక్కులుగా నమోదైంది. రిజర్వాయర్లో 12.1 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా, 70 గేట్లను 7 అడుగులు మేర ఎత్తి దిగువకు 3,04,500 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. తూర్పు పశ్చిమ కాలువలకు 13,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.