AP News: వైసీపీ పాలనతో జనం విసిగెత్తారు : పోతిన వెంకట మహేష్
ABN , First Publish Date - 2022-09-20T00:39:35+05:30 IST
Amaravathi: వైసీపీ (YSRCP) పాలనతో జనం విసిగెత్తిపోయారని జనసేన పార్టీ (Janasena) నేత పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ (Velampalli Srinivas) నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని, కేవలం వ్యక్తిగత స్వా
Amaravathi: వైసీపీ (YSRCP) పాలనతో జనం విసిగెత్తిపోయారని జనసేన పార్టీ (Janasena) నేత పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ (Velampalli Srinivas) నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని, కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. గడపగడపకు కార్యక్రమంలో ఆయనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అర్హులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయం జనసేన పార్టేనని పేర్కొన్నారు.
పవన్కు ధన్యవాదాలు..
‘‘ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లకుగాను 15 డివిజన్లలో కమిటీలను పూర్తి చేశాం. పశ్చిమ నియోజకవర్గం గెలిపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నా నియోజకవర్గం నుంచి సమీక్షలు ప్రారంభిస్తున్నందుకు ఆయనకు నా ధన్యవాదాలు.’’ అని పేర్కొన్నారు.